Tuesday, April 23, 2024

Breaking: కూలిన భవనం.. ముగ్గురు మృతి

రెండంస్తుల భవనం కూలిపోవడంతో ముగ్గురు చనిపోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా పట్టణంలో చోటుచేసుకున్నది. భారీవర్షాలతో పట్టణంలోని రెండంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. సోమవారం ఉదయం రెండు అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోడంతో అందులో నివాసముంటున్న ముగ్గురు మృతిచెందారని అధికారులు తెలిపారు. మరణించిన వారిలో రెండేండ్ల చిన్నారి, ఆమె తల్లదండ్రులు ఉన్నారని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement