Sunday, April 28, 2024

BJP : రాజస్థాన్‌ బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

గురుద్వారాలను కూల్చిపారేయాలంటూ ఓ బీజేపీ నేత వివాదాస్ప‌ద‌ వ్యాఖ్యలుచేశారు. రాజస్థాన్‌లోని తిజారాలో జరిగిన ప్రచార సభలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే సందీప్‌ దాయ్‌మా పాల్గొన్నారు. తిజారాలో ఎక్కడ పడితే అక్కడ గురుద్వారాలు కట్టారని, అవి మనకు భవిష్యత్తులో నష్టదాయకంగా మారతాయని, వాటిని కూల్చిపారేయాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.

అది మన బాధ్యతని నొక్కి చెప్పారు. దీనికి యోగి కూడా చప్పట్లు కొట్టారు. సందీప్‌ వ్యాఖ్యలపై సిక్కులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన దిష్టి బొమ్మలను దహనం చేశారు. దీంతో సందీప్‌ క్షమాపణలు చెప్పారు. గురుద్వారాకు వెళ్లి క్షమాపణ పత్రం రాసిచ్చారు. శిరోమణి గురుద్వారా కమిటీ నిర్ణయం మేరకు ఏ శిక్షకైనా సిధ్ధమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement