Wednesday, May 1, 2024

Delhi | నిర్ణీత గడువులోగా నిర్మాణం.. ఢిల్లీ బీఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయ పనులపై మంత్రి వేముల సమీక్ష

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశ రాజధాని ఢిల్లీలో వేగంగా జరుగుతున్న బీఆర్‌ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ పనులను తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యవేక్షించారు. 2021 సెప్టెంబర్‌లో వసంత విహార్‌లో కేంద్ర కార్యాలయ భవనానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేసి భూమి పూజ నిర్వహించారు. అప్పట్నుంచి పార్టీ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

భవన నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు ఢిల్లీ వచ్చిన మంత్రి ప్రశాంత్ రెడ్డి ఉర్దూ అకాడమీ ఛైర్మన్ ముజీబుద్దీన్‌తో కలిసి బుధవారం క్షేత్ర స్థాయిలో పనులను పర్యవేక్షించారు. పనుల పురోగతిపై ఆర్కిటెక్ట్ ఆస్కార్, వర్క్ ఏజెన్సీతో సమీక్ష నిర్వహించారు. అధినేత కేసీఆర్ విధించిన నిర్ణీత గడువులోగా భవనం పనులు పూర్తి కావాలని నిర్మాణ సంస్థ ప్రతినిధులను ఆయన ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement