Wednesday, May 1, 2024

Delhi | సంసద్ రత్న పురస్కార విజేతలకు ప్రధాని అభినందనలు..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : పార్లమెంట్ సభ్యులుగా అత్యుత్తమ పనితీరు కనబరిచి 2023 సంవత్సరానికిగానూ సంసద్ రత్న అవార్డుకు ఎంపికైన ఎంపీలు, పార్లమెంటరీ కమిటీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. మంగళవారం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అవార్డు విజేతలను ప్రకటించారు. 13 మంది ఎంపీలు, రెండు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలకు సంసద్ రత్న, ఒక ఎంపీ లైఫ్ టైమ్ అచీవ్‍మెంట్ అవార్డుకు ఎంపికైనట్టు ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు.

అవార్డుకు ఎంపికైన రెండు పార్లమెంటరీ కమిటీల్లో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అధ్యక్షత వహిస్తున్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ (రవాణా, పర్యాటకం, సాంస్కృతిక వ్యవహారాలు) కూడా ఒకటి. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ట్వీట్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం రీట్వీట్ చేశారు. సంసద్ రత్న పురస్కారాలు అందుకోబోతున్న నా తోటి ఎంపీలకు ఇవే నా అభినందనలు అంటూ ప్రధాని ట్వీట్ చేశారు. తమ పనితీరుతో వారు పార్లమెంటు కార్యకలాపాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement