Saturday, April 27, 2024

జాతీయ జెండాతో -కలెక్టర్ నిశాంత్ కుమార్ సెల్ఫీ

పార్వతీపురం : జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ జాతీయ జెండాతో సెల్ఫీ దిగారు. ఆజాదీ కా అమృత మహోత్సవం సందర్భంగా హర్ ఘర్ తిరంగాలో భాగంగా పార్వతీపురం మన్యం కలెక్టరేట్‌లో సెల్ఫీ పాయింట్‌ను ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్‌ నిశాంత్ కుమార్ ప్రారంభించి స్వయంగా సెల్ఫీ దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ జెండాతో కూడిన సెల్ఫీ భావోద్వేగానికి గురి చేస్తుందన్నారు. ఆ అనుభూతిని వర్ణించలేమని చెప్పారు. జాతీయ జెండా కింద నిలబడటం ఒకరకమైన ఆనందాన్ని ..సురక్షితమైన అనుభూతిని అందిస్తుందని నిశాంత్ కుమార్ తెలిపారు. రాష్ట్రానికి చెందిన పింగళి వెంకయ్య త్రివర్ణ పతాకాన్ని రూపొందించడం సంతోషకరమన్నారు. కలెక్టర్ తన సెల్ఫీని http://www.harghartiranga.com పోర్టల్‌లో అప్‌లోడ్ చేసి సర్టిఫికేట్ ను పొందారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు, జిల్లా ఐ అండ్ పిఆర్ అధికారి ఎల్.రమేష్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కె.ఎస్.ఎన్.రెడ్డి, కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఆర్. ఉమా మహేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement