Thursday, May 2, 2024

క‌బ్జాకి గురైన వాణిశ్రీ భూమి-అండ‌గా నిలిచిన సీఎం స్టాలిన్

అల‌నాటి స్టార్ న‌టులు ఎన్టీఆర్ ఎ.ఎన్‌.ఆర్ నుంచి ఎందో అగ్ర క‌థానాయ‌కుల చిత్రాల్లో హీరోయిన్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా మెప్పించి త‌న‌దైన గుర్తింపును సంపాదించుకున్నారు వాణిశ్రీ. కాగా ఆమెకి చెందిన స్థ‌లం ఒక‌టి క‌బ్జాకి గురైంది. ఆ స్థ‌లం విలువ రూ.20 కోట్లు. విష‌యాన్ని తెలుసుకున్న త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ఎం.కె.స్టాలిన్, త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం వాణిశ్రీ భూమిని క‌బ్జా కోర‌ల్లో నుంచి విడిపించారు. ఆ భూమి ప‌త్రాల‌ను వాణిశ్రీకి అప్ప‌గించారు స్టాలిన్‌. ఇదే సంద‌ర్భంలో న‌కిలీ ప‌త్రాలు, వ్య‌క్తుల ద్వారా రిజిస్ట్రేష‌న్ చేస్తే దాన్ని ర‌ద్దు చేసే అధికారాన్ని ఆ శాఖ‌కు క‌లిగిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం. తన భూమిని తనకు అప్పగించిన స్టాలిన్ సాయానికి వాణిశ్రీ ధన్యవాదాలు తెలియజేస్తూ మేలు మరచిపోలేనని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement