Saturday, April 27, 2024

స్వ‌తంత్ర భార‌త వ‌జ్రోత్స‌వాలపై సీఎం కేసీఆర్ స‌మీక్ష‌

స్వ‌తంత్ర భార‌త వ‌జ్రోత్స‌వాలపై సీఎం కేసీఆర్ స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ వ‌జ్రోత్స‌వ వేడుక‌ల‌పై ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో కే కేశ‌వ‌రావు క‌మిటీతో ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌మీక్ష నిర్వ‌హిస్తున్నారు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఈ వజ్రోత్సవాలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. వ‌జ్రోత్స‌వ వేడుకల కార్యాచరణను సీఎం కేసీఆర్ ఖరారు చేయనున్నారు. ఈ వేడుకల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై ప్రతిపాదనలను కేశవరావు కమిటీ సిద్ధం చేసిన సంగ‌తి తెలిసిందే. కమిటీ ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం కార్యాచరణను ఖరారు చేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement