Thursday, March 28, 2024

కేసీఆర్ అహంకారానికి తెలంగాణ బలవుతోంది : కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

యాద్రాద్రి : టీఆర్‌ఎస్‌ది మాటల ప్రభుత్వమే త‌ప్ప చేత‌ల ప్ర‌భుత్వం కాద‌ని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మంగళవారం యాదాద్రిలో మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ది మాటల ప్రభుత్వమేనని, అవినీతికి ప్రతిరూపం టీఆర్‌ఎస్‌ అని అన్నారు. సీఎం కేసీఆర్ అహంకారానికి తెలంగాణ బలవుతోందన్నారు. ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కిషన్‌రెడ్డి విమర్శించారు. కేజీ టు పీజీ , నిరుద్యోగ భృతి ఏమైందో కేసీఆర్‌ చెప్పాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement