Saturday, April 20, 2024

పేదింటి వధువులకు ఉప్పల ఫౌండేషన్ అండ : ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్తా

పేదింటి వ‌ధువుల‌కు ఉప్ప‌ల ఫౌండేష‌న్ అండ‌గా ఉంటుంద‌ని రాష్ట్ర ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ ఛైర్మ‌న్ ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్తా తెలిపారు. ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండలం కొత్లాబాద్ గ్రామం, వడ్డెర వృత్తి చేసుకునే వడ్డె వెంకటమ్మ క్రిష్ణయ్య ల కూతురు స్వాతి, సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామం (ఎస్సీ)కి చెందిన దీన పరిస్థితిలో ఉండి రోజువారి కూలీ పని చేసుకునే బింగి మణెమ్మ, (కీ.శే రామచంద్రం) ల కూతురు గీత వివాహానికి నాగోల్ లోని తన కార్యాలయంలో ఉప్పల శ్రీనివాస్ గుప్తా దంపతులు పుస్తెమట్టెలు, చీర, గాజులు అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్న కళ్యాణలక్ష్మీ పథకం ద్వారా ఎమ్మార్వో కార్యాలయంలో సంప్రదించి రూ.1,00,116 లను తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాములు, గోపాల్, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement