Tuesday, May 14, 2024

Breaking: ఈనెల‌ 20న ముంబైకి వెళ్ల‌నున్న‌ సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈనెల 20వ తేదీన ముంబైకి వెళ్ల‌నున్నారు. ముంబై లో ఉద్ద‌వ్ థాక్రేతో సీఎం కేసీఆర్ స‌మావేశం కానున్నారు. ఉద్ద‌వ్ థాక్రే కేసీఆర్ ను ప్ర‌త్యేకంగా ఆహ్వానించారు. భార‌తీయ జ‌న‌తా పార్టీపై కేసీఆర్ పోరాటానికి థాక్రే మ‌ద్ద‌తు తెలిపారు.

” కేసిఆర్ జీ మీరు చాలా గొప్పగా పోరాడుతున్నారు.మీది న్యాయమైన పోరాటం. ఈ దేశాన్ని విభజన శక్తుల నుండి కాపాడుకోవడానికి సరైన సమయం లో మీరు గళం విప్పారు. రాష్ట్రాల హక్కుల కోసం, దేశ సమగ్రతను కాపాడేందుకు మీరు పోరాటం కొనసాగించండి. ఇదే స్ఫూర్తి తో ముందుకు సాగండి.మా మద్దతు మీకు సంపూర్ణంగా వుంటుంది.ఈ దిశగా దేశ ప్రజలందరినీ కూడగట్టేందుకు మా వంతు సహకారాన్ని అందిస్తాం…” అంటూ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ” మిమ్మల్ని ముంబై కి ఆహ్వానిస్తున్నాను. మీరు మా ఆతిథ్యాన్ని తీసుకోండి. అదే సందర్భంలో ఈ దిశగా భవిష్యత్ కార్యాచరణ పై చర్చించుకుందాం..” అని సీఎం కెసీఆర్ ను ఉద్ధవ్ థాకరే ఆహ్వానించారు. ఇదిలా ఉండగా… నిన్న మాజీ ప్ర‌ధాని దేవెగౌడ కూడా సీఎం కేసీఆర్ కు మ‌ద్ద‌తు తెలిపిన విష‌యం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement