Monday, May 6, 2024

T హ‌బ్-2 ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

ఒకేసారి 2 వేలకు పైగా స్టార్టప్‌లకు వసతి కల్పించేందుకు నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల ప్రాంగణం టీహబ్ -2 ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈసంద‌ర్భంగా టీ హ‌బ్-2 ప్రాంగ‌ణమంతా కేసీఆర్ క‌లియ తిరిగారు. టీ హ‌బ్ ఫెసిలిటీ సెంట‌ర్ ప్ర‌త్యేక‌త‌ల‌ను అధికారులు సీఎం కేసీఆర్‌కు వివ‌రించారు. కేసీఆర్ వెంట ఐటీ మంత్రి కేటీఆర్, డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి, మాజీ స్పీక‌ర్ మ‌ధుసూద‌నాచారి, ప‌రిశ్ర‌మ‌ల శాఖ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి జ‌యేశ్ రంజ‌న్‌తో పాటు ప‌లువురు ఉన్నారు. దేశ, విదేశాలకు చెందిన వివిధ రంగాల ప్రముఖులు టీహబ్‌-2 ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement