Saturday, April 27, 2024

Breaking : కొత్త సచివాలయంలో సీఎం కేసీఆర్‌


నూతనంగా నిర్మిస్తున్న సచివాలయ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్‌ పరిశీలించారు. కాంట్రాక్టర్లతో మాట్లాడి పనులు వివరాలను తెలుసుకున్నారు. సచివాలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. దాదాపు పనులు పూర్తి కావస్తున్నట్లు వారు తెలిపారు. బయట రోడ్లను కేసీఆర్‌ పరిశీలించారు. భవనం మొత్తం కలియతిరిగి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. సీఎం కేసీఆర్‌ వెంట సీఎస్‌ శాంతకుమారి, మంత్రి వేముల ప్రశాంత్‌, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, అధికారులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement