Wednesday, May 1, 2024

జడ్జిలు ఫిర్యాదు చేసినా సీబీఐ పట్టించుకోవడం లేదు: సీజేఐ రమణ..

జార్ఖండ్ లో జడ్జి హత్యకేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే..జడ్జి హత్య కేసును సుమోటోగా విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. విచారణ సందర్భంగా ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. అనుకూలంగా తీర్పు రాకపోతే న్యాయవ్యవస్థను కించపరచడం బాధాకరమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోర్టు న్యాయమూర్తులు బెదిరింపుల గురించి ఫిర్యాదు చేసినప్పుడు సీబీఐ కానీ, ఇతర దర్యాప్తు సంస్థలు ఎందుకు స్పందించవని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇక, జడ్జిలు ఫిర్యాదు చేసినా సీబీఐ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ధన్‌బాద్ అడిషనల్ సెషన్స్ జడ్జి ఉత్తమ్ ఆనంద్‌ హత్య కేసును నిన్న స్వాధీనం చేసుకుంది సీబీఐ.. జూలై 28న మార్నింగ్‌ వాక్‌కు వెళ్లిన న్యాయమూర్తి ఆనంద్‌ను ఆటోతో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందారు.. సంచలనం సృష్టించిన ఈ ఘటనపై సీబీఐ విచారణ జరపాలని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ ఇటీవల కేంద్రానికి సిఫారసు చేశారు. దీంతో.. సీబీఐ రంగంలోకి దిగింది.

ఇక జడ్జి హత్య కేసును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సారథ్యంలోని బెంచ్ సుమోటోగా జడ్జి ఉత్తమ్‌ ఆనంద్‌ హత్య కేసును విచారణకు స్వీకరించింది.. ఈ సందర్భంగా జార్ఖండ్‌ ప్రభుత్వ తరపున న్యాయవాది పలు అంశాలను ప్రస్తావించారు.. ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ కొనసాగిస్తున్నట్టు కోర్టుకు తెలిపారు. ఇదే సమయంలో సీబీఐకి ఈ కేసును ట్రాన్స్‌ఫర్‌ చేసిన విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. ఈ నేపథ్యంలో సీజేఐ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు… ఈ కేసు సీబీఐకి అప్పగించి చేతులు దులుపుకున్నారని వ్యాఖ్యానించిన ఆయన.. జడ్జిలకు వస్తున్న బెదిరింపులపై ఐబీకి గానీ, సీబీఐకి గానీ ఫిర్యాదు చేసినా.. అటువైపు నుంచి సానుకూలమైన స్పందన రావడంలేదన్నారు. సీబిఐ తన వైఖరిని మార్చుకోలేదు. బెదిరింపులపై సీబీఐ, ఇంటెలిజెన్స్ బ్యూరోకు న్యాయమూర్తులు ఫిర్యాదు చేసినప్పుడు వారు స్పందించరు. దర్యాప్తు సంస్థలు ఏమాత్రం సహాయపడవు మరియు నేను కొంత బాధ్యతతో ఈ ప్రకటన చేస్తున్నాను” అని చీఫ్ జస్టిస్ రమణ అన్నారు. ఇక, ఈ కేసులో వచ్చేవారం నుంచి పూర్తిస్థాయిలో విచారణ జరపనున్నట్టు తెలిపారు.

ఇది కూడా చదవండి: దళిత బంధుపై మరో పిటిషన్.. హైకోర్టు కీలక సూచన

Advertisement

తాజా వార్తలు

Advertisement