Sunday, May 19, 2024

Chttisghad – ఎన్ కౌంట‌ర్ లో మ‌హిళ న‌క్స‌లైట్ హ‌తం….

రాయ్‌పూర్ : చ‌త్తీస్‌ఘ‌ఢ్‌లోని కాంకేర్ జిల్లాలో సోమ‌వారం ఉద‌యం న‌క్స‌ల్స్‌కు భ‌ద్ర‌తా ద‌ళాల మ‌ధ్య ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. దీనిలో మ‌హిళా న‌క్స‌ల్ మ‌ర‌ణించింది. ఈనెల 7న బిజాపూర్ జిల్లాలోని అట‌వీ ప్రాంతంలో భ‌ద్ర‌తా ద‌ళాలు, న‌క్స‌ల్స్ మ‌ధ్య ఎన్‌కౌంట‌ర్ జ‌రిగిన అనంత‌రం మ‌రోసారి న‌క్స‌ల్స్‌, పోలీసులు త‌ల‌ప‌డ్డారు.

7న జ‌రిగిన ఘ‌ట‌న‌లో కోబ్రా, స్పెష‌ల్ టాస్క్‌ఫోర్స్ జాయింట్ ఆప‌రేష‌న్‌లో భాగంగా న‌క్స‌ల్స్‌ను భ‌ద్ర‌తా ద‌ళాలు చుట్టుముట్టాయి. అప్ప‌టి నుంచి ఆ ప్రాంతంలో అప్పుడ‌ప్ప‌డు తుపాకి మోత మోగుతూనే ఉంది… తాజాగా ఎన్‌కౌంట‌ర్ జ‌రిగిన స‌మ‌యంలో చ‌త్తీస్‌ఘ‌ఢ్‌లోని బీజాపూర్‌, సుక్మా జిల్లాల స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో భారీ పేలుళ్లు, కాల్పుల శ‌బ్ధాలు వినిపించాయి. దీంతో అప్ర‌మ‌త్త‌మైన భ‌ద్ర‌తాద‌ళాలు గాలింపు చ‌ర్య‌ల‌ను ముమ్మ‌రం చేశారు.. ఈ స‌మ‌యంలోనే మ‌హిళా న‌క్స లైట్ మృత‌దేహం క‌నిపించింది.. అలాగే ఈ ప్రాంతంలో భారీగా ఆయుధాల‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement