Friday, April 26, 2024

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో పీవీ సింధుకు ఘన సత్కారం

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధును మెగాస్టార్ చిరంజీవి తన ఇంటికి ఆహ్వానించారు. ఈ మేరకు శనివారం రాత్రి పీవీ సింధు మెగాస్టార్ ఇంటికి వెళ్లగా.. ఆమెకు ఘనస్వాగతం లభించింది. అనంతరం మెగాస్టార్ కుటుంబంతో పాటు పలువురు సినీ ప్రముఖులు, ఆత్మీయులు పీవీ సింధును సత్కరించారు. ఈ కార్య‌క్ర‌మానికి నాగార్జున‌, రానా,రామ్ చ‌ర‌ణ్‌, సాయిధ‌ర‌మ్ తేజ్, శ‌ర్వానంద్, హీరోయిన్స్ రాధిక‌, సుహాసినితో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు.

అనంతరం పీవీ సింధు సాధించిన మెడల్‌తో చిరంజీవి సహా పలువురు ప్రముఖులు ఫోటోలు దిగారు. దీనికి సంబంధించిన వీడియోను చిరు త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘దేశం గర్వించేలా వరుసగా రెండు సార్లు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన మన పీవీ సింధుని ఆత్మీయుల మధ్య సత్కరించుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది’ అంటూ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: ‘పుష్ప’ నుంచి బిగ్ అప్‌డేట్.. భయపెడుతున్న విలన్ లుక్

Advertisement

తాజా వార్తలు

Advertisement