Saturday, May 4, 2024

చైనా నిరసనలు, వెనక్కి తగ్గిన ప్రభుత్వం.. తాత్కాలిక లాక్‌డౌన్‌ ఎత్తివేస్తున్నట్లు ప్రకటన

చైనాలో కోవిడ్‌ 19 మూలాలను పూర్తిగా తగ్గించాలని ప్రభుత్వం కఠినచర్యలకు ఉప్రకమించింది. ‘జీరోకోవిడ్‌’ నినాదంపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. గ్వాంగ్‌జౌ, చాంగ్‌కింగ్‌ అడ్డాలను తగ్గించారు విస్తృతమైన నిరసనల నేపథ్యంలో ప్రభుత్వం తన ”సున్నాకోవిడ్‌” వైఖరిలో చర్యలను కొంతమేర సడలించింది. ఈ మేరకు గ్వాంగ్‌జౌ మరియు చాంగ్‌కింగ్‌ బుధవారం కఠినమైన చర్యలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. నైరుతి నగరమైన చాంగ్‌కింగ్‌ కోవిడ్‌ 19 ఉన్న వ్యక్తులతో సన్నిహిత పరిచయాలను అనుమతిస్తూ.. కొన్ని షరతులను విధించారు. కోవిడ్‌ లక్షణాలు ఉన్నవారు ఇంటినుండి బయటకు రావద్దని.. ఇంటిలోఉండి జాగ్రత్తలు తీసుకోవాలని నగర అధికారి ఒకరు తెలిపారు. హాంకాంగ్‌ సమీపంలోని గ్వాంగ్‌జౌ సమీపంలోని ఏడు జిల్లాల్లో విధించిన తాత్కాలిక లాక్‌డౌన్‌లను ఎత్తివేస్తున్నట్లు అధికారులకు ప్రకటించారు. పాఠశాలల్లో వ్యక్తిగత తరగతులను పున:ప్రారంభించేందుకు అనుమతిస్తామని, సినిమాహాళ్లతో సహా రెస్టారెంట్లు మరియు ఇతర వ్యాపారాలను తిరిగి తెరిచేందుకు అనుమతి ఇచ్చింది.


దేశంలో కోవిడ్‌ ప్రతిస్పందనకు బాధ్యత వహిస్తున్న వైస్‌ ప్రీమియర్‌ సన్‌ చున్లాన్‌ అధికారులతో మాట్లాడుతూ, మహమ్మారి నియంత్రణలలో దేశం ”కొత్త దశ, మిషన్‌” ను ఎదుర్కొందని మీడియా జిన్హువా నివేదించింది. వైరల్‌ ఇన్ఫెక్షన్‌తో బాధపడేసమయంలో ”మానవ కేంద్రీకృత విధానం” తీసుకోవాలని జిన్హువా పేర్కొన్నారు. ఈ ప్రభుత్వ సూచనలతో ముఖ్యమైన మార్పును తెస్తుందన్నారు. దీనివల్లనే ఇప్పటివరకు జీరోకోవిడ్‌ విధానం వ్యాపించకుండా స్థిరంగా ఉందన్నారు.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల గ్వాంగ్‌జౌలోని హైజుజిల్లాలో నిరసనకారులు పోలీసులతో ఘర్షణకు దిగడంతో ఆంక్షలు కొంతమేర సడలిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇటీవలన చేసిన నిరసనలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రజలు అడ్డంకులను కూల్చివేస్తున్నట్లు, పూర్తి రక్షణగా ఉంచిన బారీకేడ్‌లను ధ్వంసం చేయడంతోపాటు, పోలీసు అధికారులపై గాజు సీసాలు విసిరి హింసాత్మకంగా మార్చారు. రక్షణగా పోలీసులు తలలపై కవచాలను పట్టుకున్నట్లు మీడియాలో వచ్చాయి. నిరసనకారుల గుంపును చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించడం, చేతికి సంకెళ్లతో ప్రజలను తీసుకెళ్లడం వంటి వీడియోలు ప్రపంచవ్యాప్తంగా వైరల్‌ అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement