Monday, May 20, 2024

China Masters | సింగిల్స్, డబుల్స్‌లో ఆట‌గాళ్ల జోరు.. క్వార్టర్ ఫైనల్స్‌కు భార‌త్

చైనాలో జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్ర‌వేశించింది. ఇవ్వాల జ‌రిగిన సెకండ్ రౌండ్ లో భార‌త ప‌రుషుల డ‌బుల్స్ జంట సాత్విక్‌-చిరాగ్ జపాన్‌కు చెందిన అకిరా కోగా-తైచి సైటో జోడీని 46 నిమిషాల్లో 21-15, 21-16 పాయింట్ల తేడాతో ఓడించి క్వార్టర్స్‌లోకి అడుగు పెట్టారు. ఇక క్వార్ట‌ర్ ఫైన‌ల్స్ లో భారత జోడీ ఇండోనేషియాకు చెందిన లియో రోలీ కార్నాండో-డేనియల్ మార్థిన్‌తో తలపడనుంది.

అదేవిధంగా మెన్స్ సింగిల్స్ ఈవెంట్‌లో… ప్రణయ్ కూడా వరుస గేమ్‌లలో విజయం సాధించి క్వార్టర్‌ఫైనల్‌లోకి ప్రవేశించాడు. డెన్మార్క్‌కు చెందిన మాగ్నస్ జోహన్నెసెన్‌తో 40 నిమిషాల పాటు జ‌రిగిన పోరులో… 21-12, 21-18 తేడాతో విజయం సాధించి క్వార్ట‌ర్స్ లోకి చేకుకున్నాడు. ప్రణయ్ తర్వాత జపాన్‌కు చెందిన కోడై నరౌకాతో తలపడనున్నాడు.

ఇక నిన్న జ‌రిగిన‌ పురుషుల సింగిల్స్ ఈవెంట్‌లో లక్ష్యసేన్, కిదాంబి శ్రీకాంత్, ప్రియాంషు రజావత్‌లు.. మ‌హిళ‌ల డ‌బుల్స్ లో రుతుపర్ణ పాండా-శ్వేతపర్ణ పాండా తొలి రౌండ్‌లోనే ఇంటి బాట‌ప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement