Monday, April 29, 2024

గిరిజన సమస్యల పరిష్కారంలో కేంద్రం విఫలం – సత్యవతి రాథోడ్

గిరిజన సమస్యల పరిష్కారంలో కేంద్రం విఫలమైందని తెలంగాణ రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ప్రధాని సహా ఎంత మంది వచ్చినా తెలంగాణకు లాభం లేదన్నారు. సీఎం కేసీఆర్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారన్నారు. గిరిజనుల రిజర్వేషన్ బిల్లు ప్రతిపాదనను పట్టించుకోవట్లేదన్నారు. రిజర్వేషన్లు లేక ఉద్యోగాలు, విద్యలో గిరిజనులు నష్టపోతున్నారన్నారు. గిరిజన యూనివర్శిటీపై కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. గురుకులాల ద్వారా కేసీఆర్ నాణ్యమైన విద్యనందిస్తున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement