Monday, April 29, 2024

పలు అభివృద్ధి పనులకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌.. వన్యప్రాణి బోర్డు అనుమతులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణకు సంబంధించి పలు కారణాలతో పెండింగ్‌లో ఉన్న 23 వివిధ అభివృద్ది పనులకు కేంద్ర వన్య ప్రాణి బోర్డు ఆమోదం తెలిపింది. ఢిల్లీలో జరిగిన నేషనల్‌ వైల్డ్‌ లైఫ్‌ బోర్డు సమావేశంలో ఈ మేరకు చర్చించి అధికారులు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. నిర్మల్‌ జిల్లా కడెం ప్రాజెక్టుపై నిర్మించ తలపెట్టిన లక్ష్మీపూర్‌ లిప్ట్‌n ఇరిగేషన్‌ (ఖానాపూర్‌ పరిధి) పథకానికి వైల్డ్‌ లైఫ్‌ బోర్డ్‌ అనుమతులను ఇచ్చింది. సాగునీటి శాఖ ప్రతిపాదనలను అటవీ శాఖ నిబంధనల మేరకు వైల్డ్‌ లైఫ్‌ బోర్డు ద్వారా అనుమతులు సాధించింది.

3.17 హెక్టార్ల అటవీ భూమిని ఈ ప్రాజెక్టు కోసం మళ్లించేందుకు కేంద్రం అంగీకారం తెలిపినట్లు- సమావేశానికి హాజరైన తెలంగాణ రాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్‌, హెచ్‌ఓఎఫ్‌ఎఫ్‌) ఆర్‌.ఎం. డోబ్రియాల్‌ ఈమేరకు తెలిపారు. దీంతోపాటు- తీవ్రవాద ప్రభావిత జిల్లాల్లో రోడ్ల నిర్మాణ, రోడ్ల వెడల్పుకు సంబంధించిన 11 ప్రతిపాదనలకు, ఐదు పంచాయితీరాజ్‌ రోడ్లకు, కుమరంభీమ్‌ అసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ డివిజన్‌లో విద్యుత్‌లైన్‌ ప్రతిపాదనకు కేంద్ర వన్యప్రాణి బోర్డు ఆమోదం తెలిపిందని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement