Monday, April 29, 2024

అభివృద్ధి పనులకు శంకుస్థాపన : మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు

భువనగిరి, ప్రభన్యూస్ : భువనగిరి పట్టణ కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, కౌన్స్ లర్లు కోళ్ల దుర్గాభవాని, అవంచికలు శంకుస్థాపన చేశారు. 14వ ఆర్ధిక సంఘం, ఎల్ ఆర్ ఎస్ నిధుల నుండి 33 వ వార్డులో రూ. 3.60 లక్షలు సీసీ, రూ. 3.15 లక్షలతో డ్రైన్ నిర్మాణ పనులు, 34 వ వార్డులో రూ.6 లక్షలతో సీసీ, డ్రైన్ పనుల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పంగరెక్క స్వామి, కిరణ్ కుమార్, నాయకులు గంగాధర్, నగేష్,రాజేష్, పాండు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement