జగిత్యాల జిల్లాలోని కోరుట్ల శిరిడీసాయి దేవాలయంలో దత్త జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈరోజు తెల్లవారుజాము నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ బోర్డు సభ్యులు, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగరరావు ప్రత్యేక పూజల్లో పాల్గొని సాయినాధుడిని దర్శించుకున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital