Saturday, April 27, 2024

అదుపు త‌ప్పి హుస్సేన్ సాగ‌ర్ లోకి దూసుకెళ్ళిన కారు .. యువ‌కుల‌కు స్వ‌ల్ప గాయాలు ..

అదుపుత‌ప్పిన కారు హుస్సేన్ సాగ‌ర్ లోకి దూసుకెళ్ళింది. దీంతో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జు అయ్యింది . కారులో ఉన్న ముగ్గురు యువకులకు స్వల్ప గాయాలయ్యాయి . సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు . కారులో ఉన్న యువకులను బయటకుతీసి .. యశోద ఆసుప‌త్రికి తరలించారు . ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు . యువకులు ఖైరతాబాద్ కు చెందిన నితిన్ , స్పత్రిక్ , కార్తీక్ గుర్తించారు . కారును నాలుగు రోజుల క్రితమే తీసుకున్నారని , ఖైరతాబాద్ నుంచి అఫ్జల్ గంజ్ లో టిఫిన్ చేయడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement