Tuesday, May 7, 2024

ఎవరూ తన శక్తిని, ధైర్యాన్ని అడ్డుకోలేరు.. గవర్నర్ తమిళిసై

ఏ ఒక్కరూ తన శక్తిని, ధైర్యాన్ని అడ్డుకోలేరని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. తెలంగాణ గవర్నర్ గా మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజ్ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడారు. ప్రజా సమస్యలు తెలుసుకునే క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానన్నారు. వివక్షను ఎట్టి పరిస్థితుల్లో సహించనన్నారు. మేడారం వెళ్లేందుకు హెలికాప్టర్ అడిగితే చివరి నిమిషం వరకు ప్రభుత్వం స్పందించలేదన్నారు. 8గంటలు ప్రయాణించి రోడ్డుమార్గంలో వెళ్లానన్నారు.

ఎవరినీ వేలెత్తి చూపేందుకు తాను ఇవన్నీ చెప్పడం లేదన్నారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం లేకుండా చేశారన్నారు. రిపబ్లిక్ డే రోజు జెండా వందనం లేకుండా చేశారన్నారు. తాను ఎక్కడికి వెళ్లినా అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదన్నారు. తాను వెళ్లిన చోటకు కనీసం కలెక్టర్ వచ్చి పలకరించడం లేదన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా నా పని నేను కొనసాగిస్తానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement