Friday, April 26, 2024

KTK 8వ గనిలో పేలుడు … నలుగురు కార్మికులకు తీవ్రగాయాలు

బొగ్గు వెలికితీసేందుకు వాడే బాంబ్ పేలి నలుగురు కార్మికులకు తీవ్రగాయాలైన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని భూపాలపల్లి జిల్లాలోని కేటీకే 8వ గనిలో చోటుచేసుకుంది. కాకతీయ లాంగ్ వాల్ ప్రాజెక్ట్ అండర్ గ్రౌండ్ లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కార్మికులు రామక్రిష్ణ, శ్రీనివాస్, రాజశేఖర్, ప్రకాశ్ కు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన కార్మికులను భూపాలపల్లి సింగరేణి ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement