Sunday, May 5, 2024

బాలాపూర్‌ వినాయకుడికి ఎమ్మెల్సీ కవిత ప్ర‌త్యేక పూజ‌లు

ఎమ్మెల్సీ కవిత హైద‌రాబాద్ నగరంలో ప్రఖ్యాతి చెందిన బాలాపూర్‌ వినాయకుడిని దర్శించుకున్నారు. గణేశ్‌ మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కవితకు లడ్డూ ప్రసాదం అందజేశారు. ఆమెతోపాటు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడు కార్తిక్‌రెడ్డి పూజలో పాల్గొన్నారు. ఈసంద‌ర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. బాలాపూర్‌ గణేశుడిని తొలిసారిగా దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధికి ఎలాంటి విఘ్నాలు రాకూడదని భగవంతుడిని కోరుకున్నానని చెప్పారు. వినాయక ఉత్సవాల్లో బాలాపూర్‌ లడ్డూపై ఉత్సాహం ఉంటుందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement