Monday, May 13, 2024

బస్సు ప్రమాదంలో 14 మంది దుర్మరణం

మన పొరుగు దేశం శ్రీలంకలో తీవ్ర విషాదం నెలకొంది. పస్సార పట్టణంలో 70 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 14 మంది ప్రయాణికులు చనిపోయారు. మరో 31 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని డాక్టర్లు తెలిపారు. ఇరుకు ప్రాంతంలో ఒకేసారి ట్రక్కు, బస్సు రావడంతో ట్రక్కును తప్పించబోయే ప్రయత్నంలో బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఈ ఘోర ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు. కాగా ఈ రోడ్డు వెంట తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయని స్థానికులు చెప్తున్నారు. 16 ఏళ్లల్లో ఇదే అతి పెద్ద ప్రమాదమని అధికారులు గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement