Sunday, April 28, 2024

ముంబైలో కరోనా కల్లోలం

కరోనా మహమ్మారి మహారాష్ట్రాను వణికిస్తోంది. ముంబైలోని అతిపెద్ద మురికివాడ ధారావిలో కరోనా మహమ్మారి మరోసారి విశ్వరూపం దాల్చుతోంది. గత ఫిబ్రవరితో పోల్చితే మార్చిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 62 శాతం పెరిగినట్టు అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరిలో ఇక్కడ మొత్తం 168 కేసులు నమోదు కాగా.. మార్చిలో ఇప్పటి వరకు 272 మంది కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ధారావిలో 72 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 2.5 చదరపు కిలోమీటర్లకు పైగా విస్తీర్ణంలోని ఈ మురికివాడలో కొవిడ్ కేసులు ఒక్కసారిగా పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే కరోనా మహమ్మారి వెలుగుచూసిన గత యేడాది నాటికంటే ఇప్పుడు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామని అధికారులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement