Saturday, May 4, 2024

యూఎస్‌ కంటే ఒకరోజు ముందే భారత్ లో రిలీజ్ కానున్న బుల్లెట్‌ ట్రైన్ మూవీ.!

ప్రభ న్యూస్ : హాలీవుడ్‌ స్టార్‌ బ్రాడ్‌ పిట్‌ రాబోయే చిత్రం బుల్లెట్‌ ట్రైన్‌ ఆగస్టు 4న యూఎస్‌ కంటే ఒకరోజు ముందుగా భారతదేశంలో విడుదలకు సిద్ధంగా ఉంది. డెడ్‌ పూల్‌ 2 దర్శకుడు డేవిడ్‌ లీచ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా హాలీవుడ్‌లోని అత్యంత ప్రజాదరణ పొందిన పేర్లతో కూడిన సమిష్టి తారాగణాన్ని కలిగి ఉంటుంది. ఈ చిత్రంలో కిస్సింగ్‌ బూత్‌ నటుడు, పీపుల్స్‌ చాయిస్‌ అవార్డు విజేత, గోల్గెన్‌ గ్లోబ్‌ అవార్డు నామినీ, జోయి కింగ్‌తో పాటు బహుళ ప్రైమ్‌ టై ఎమ్మీ అవార్డు నామినీఈ బ్రియాన్‌ టైరీ హెన్రీ.

అవెంజర్స్‌, ఏజ్‌ ఆఫ్‌ అల్ట్రాన్‌ ఫేమ్‌ ఆరోన్‌ టేలర్‌ – జాన్సన్‌, ది బాయ్స్‌ కూడా నటించనున్నారు. ప్యూరీ ఫేమ్‌ లోగాన్‌ లెర్మాన్‌ తదితరులున్నారు. సోనీ పిక్చర్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండియా బుల్లెట్‌ ట్రైన్‌ ని దేశంలోని థియేటర్లలో ఇంగ్లీషు, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ఆగస్టు 4న విడుదల చేయనుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement