Monday, April 29, 2024

ఢిల్లీలో కూలిన భ‌వ‌నం : శిథిలాల కింద చిక్కుకున్న ఐదుగురు

దేశ రాజధాని ఢిల్లీలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. సత్యనికేతన్ ప్రాంతంలోని ఓ భవంతి ఈరోజు కుప్పకూలింది. భ‌వ‌నం ఉన్న‌ట్లుండి కుప్ప‌కూల‌డంతో శిథిలాల క్రింద ఐదుగురు కార్మికులు చిక్కుకున్నారు. మూడు అగ్నిమాపక శకటాలు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నాయి. సహాయక కార్యక్రమాలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. అయితే భ‌వ‌నం కూలిన ప్ర‌మాదంలో క్షతగాత్రులు, మృతులు, ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement