Monday, May 6, 2024

సంస్థాన్ నారాయణపురంలో పట్టపగలే చోరీ

సంస్థాన్ నారాయణపురం : యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో పట్టపగలే చోరీ జ‌రిగింది. ఈరోజు మ‌ధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో లింగంపల్లి పెద్ద నరసింహ ఇంట్లో చోరీ జ‌రిగింది. సుమారు 7తులాల బంగారం, 70 తులాల వెండి అపహరణకు గురైనట్లు బాధితులు తెలుపుతున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీం ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement