Sunday, May 19, 2024

TS | బీఆర్‌ఎస్‌కు షాక్.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మరో బీఆర్‌ఎస్ ఎంపీ

బీఆర్ఎస్ పార్టీకి మరో పెద్ద షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన వరంగల్‌ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్‌ కాంగ్రెస్‌లో చేరారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన దయాకర్.. ఇవ్వాల‌ హైదరాబాద్ గాంధీభవన్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి కొండా సురేఖ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే గోషామహల్ బీఆర్ఎస్ నేత నందకిశోర్ వ్యాస్ కూడా హస్తం కండువా కప్పుకున్నారు.

మరోవైపు బీజేపీకి చెందిన మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి శుక్రవారం నాడు సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా, రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారు (క్రీడా వ్యవహారాలు)గా జితేందర్‌రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement