Thursday, May 2, 2024

BRO | “మై డియర్ మార్కండేయ” రిలీజ్.. పవన్ స్వాగ్ తో అదిరిన సాంగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌ క‌లిసి నటించిన మెగా మల్టీస్టార‌ర్ “బ్రో ది అవతార్”. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలయికలో వస్తున్న ఈ సినిమా మెగా అభిమానులకు చాలా ప్రత్యేకం. సముద్రఖని దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా నుంచి అవైటెడ్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. నిన్న ఎనౌన్స్ చేసిన‌ట్టుగానే.. మేకర్స్ ఈ మూవీ నుండి ఫ‌స్ట్ సింగిల్ “మై డియర్ మార్కండేయ” సాంగ్ ను కొద్ది సేప‌టి క్రితం రిలీజ్ చేశారు. మై డియర్ మార్కండేయ అంటూ సాయి ధరమ్ తేజ్.. పవన్ లపై డిజైన్ చేసిన ఈ సాంగ్ మంచి మాస్ వైబ్స్ తో బాగుంది అనే చెప్పాలి.

కాగా, రామజోగయ్య శాస్త్రి రాసిన అందమైన సాహిత్యానికి థమన్ సింపుల్ బీట్స్ చక్కగా పూరించాయి. ఈ సాంగ్ లో స్టైలింగ్ తో సాయి తేజ్ అదరగొట్టగా.. పవన్ క‌ళ్యాన్ ఇన్ బిల్ట్ స్వాగ్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ లా అనిపించవచ్చు. ఇక ఆకట్టుకునే అందాల సుందరి ఊర్వశి రౌతేలా ఆకస్మిక ఎంట్రీ కూడా బాగుంది. ఓవరాల్ గా అయితే ఓ డీసెంట్ మ్యూజికల్ నెంబర్ ని అయితే థమన్ అందించాడని చెప్పాలి. ఇక ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తుండగా జూలై 28న ఈ సినిమా రిలీజ్ కి సిద్దంగా ఉంది.

- Advertisement -
YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement