Friday, May 3, 2024

Breaking : పెన్నా నదిలో ఇద్దరు గల్లంతు

జొన్నవాడ పెన్నా నదిలో ఇద్దరు గల్లంతైన సంఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. కాకులపాడు గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థులు ఐదు మంది జొన్నవాడ దేవస్థానానికి రాగా.. పక్కనే ఉన్న పెన్నా నదిలో ఈత కొట్టే క్రమంలో ఇద్దరు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో షేక్ మున్న, అచ్యుత రాకేష్ ఉన్నట్లు ప్రత్యేక సాక్ష్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ వీర ప్రతాప్ గజ ఈత గాళ్ల సహాయంతో గల్లంతైన వారి కోసం గాలింపు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement