Thursday, May 16, 2024

Big Breaking : ఘోర అగ్నిప్ర‌మాదం – 35మృత‌దేహాలు స్వాధీనం-450మంది మృతి చెంది ఉంటార‌ని అంచ‌నా

ఘోర అగ్నిప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో 35మృత‌దేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్ర‌మాదం బంగ్లాదేశ్ సీతాకుండ ప్రాంతంలో చోటు చేసుకుంది. ప్రైవేటు ఇన్ లాండ్ కంటెయినర్ లో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. చిట్టగాంగ్ పోర్టు సమీపంలో ఈ ఘటన జరిగింది. అగ్నిమాపక నిరోధక విభాగం తీవ్రంగా శ్రమించింది. అగ్ని కీలలు ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా చర్యలు చేపట్టింది. ఆదివారం మధ్యాహ్నం వరకు 35 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదంలో కనీసం 450 మంది వరకు మరణించి ఉంటారని అంచనా. నిల్వ ఉంచిన రసాయనాల వల్లే ప్రమాదం జరిగినటు పోలీసులు ప్రకటించారు. కంటెయినర్లలో మండే స్వభావం రసాయనాలు ఉండగా.. ఒకదాని తర్వాత ఒకటి వరుసగా పేలినట్టు గుర్తించారు. పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉంద‌ని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement