మొయినాబాద్ ఫామ్ హౌజ్ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు రిమాండ్ తరలించాలని హైకోర్టు ఆదేశించింది. ఇందులో భాగంగానే పోలీసులు షేక్ పేటలోని హిల్ టాప్ అపార్ట్మెంట్ లోని ఉన్న నందకుమార్ ఇంటికి చేరుకున్నారు. నందకుమార్, సింహయాజులు, భారతి స్వాములు ఇక్కడే ఉన్నారని పోలీసులు తెలిపారు. ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకుని నేరుగా సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయానికి తరలించారు. సాయంత్రంలోగా ఏసీబీ కోర్టులో ముగ్గురిని హాజరు పరచనున్నట్లు పోలీసులు వివరించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement