Sunday, May 19, 2024

Breaking : శిశువు మృతి..ఏఎన్ఎం సావిత్రిపై దాడి..

కామారెడ్డి జిల్లా స‌దాశివ‌న‌గ‌ర్ మండ‌లం ప‌ద్మాజీవాడిలో ఏఎన్ ఎం సావిత్రిపై దాడి జ‌రిగింది. ఏడు నెల‌ల గ‌ర్భిణి శ్రీల‌త‌కు, ఏఎన్ ఎం సావిత్రి క‌రోనా టీకా వేసింది.. కాగా అనారోగ్యంతో ఏడు నెల‌ల‌కే ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది శ్రీల‌త‌. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ శిశువు మృతి చెందింది. అయితే శిశువు మృతికి క‌రోనా వ్యాక్సిన్ కార‌ణ‌మంటూ ఏఎన్ ఎంపై బంధువులు దాడికి దిగారు. పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని కేసు న‌మోదు చేసుకున్నారు. ఇరువురికి స‌ర్థిచెప్పే ప్ర‌య‌త్నం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement