Friday, May 10, 2024

Breaking : ల‌క్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పెద్ద‌ప‌ల్లి ఆర్డీఓ ..

ల‌క్ష రూపాయ‌లు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు పెద్ద‌ప‌ల్లి ఆర్డీఓ శంక‌ర్ కుమార్..రామ‌గుండం కార్పొరేష‌న్ లో కాంట్రాక్ట‌ర్ గా ప‌ని చేస్తోన్న ర‌జ‌నీకాంత్ కి ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి, శానిటేష‌న్ లిక్విడ్ కు సంబంధించిన రూ.9.25లక్షల బిల్లు రావాల్సి ఉంది. చెక్కు రిలీజ్​చేయాలంటే రూ.లక్ష లంచంగా ఇవ్వాలని ఆర్డీఓ శంకర్​ కుమార్​ డిమాండ్​ చేశాడు. ఇస్తానని ఒప్పుకున్న రజనీకాంత్ ఏసీబీని ఆశ్రయించాడు. ముందుగా సూచించిన ప్రకారం ఆర్డీఓ బంధువు అయిన మల్లికార్జున్ అనే వ్యక్తికి కాంట్రాక్టర్​ రూ.లక్ష ఇచ్చాడు. మల్లికార్జున్ ఆ డబ్బును ఆర్డీఓ శంకర్​కుమార్​కు అతని ఆఫీస్​లో ఇస్తుండగా ఏసీబీ ఆఫీసర్లు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. శంకర్​కుమార్, మల్లికార్జున్ పై కేసు నమోదు చేశామని ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement