Sunday, April 28, 2024

అమ‌రావ‌తి రైతుల పాద‌యాత్ర‌ను అడ్డుకున్న పోలీసులు

గ‌త 31 రోజులుగా అమరావతి రాజధాని రైతులు మహాపాదయాత్ర చేస్తున్నారు. ఈరోజు నెల్లూరు జిల్లా మరుపూరు నుంచి రైతుల పాదయాత్ర ప్రారంభించారు. అయితే పాద‌యాత్ర‌ సర్వేపల్లి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. రైతుల పాద‌యాత్ర‌కు టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఘనస్వాగతం పలుక‌గా, బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు కూడా ఈరోజు రైతుల పాదయాత్రలో పాల్గొన్నారు.

అయితే పాదయాత్ర చేస్తున్న రాజధాని రైతులకు పోలీసులు షాకిచ్చారు. పాదయాత్రలో క్రైస్తవ, ముస్లిం ప్రచార రథాలను వారు అడ్డుకున్నారు. ప్రచార రథాలను వెంట తీసుకువెళ్లరాదంటూ వారు స్పష్టం చేశారు. దీంతో ప్రచార రథాలను అనుమతించాలని పోలీసులతో రైతులు వాగ్వాదానికి దిగారు. ప్రచార రథాలను పోలీసులు అడ్డుకోవడంపై రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై బైఠాయించి అమరావతి రైతులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement