Thursday, May 9, 2024

పార్లమెంట్ 59వ‌ గ‌దిలో అగ్నిప్రమాదం

ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో ఇవాళ ఉద‌యం అగ్ని ప్రమాదం జరిగింది. పార్లమెంటులోని 59వ గదిలో మంటలు చెలరేగాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే కొద్దిసేపటికే అగ్నిమాపక దళాలు మంటలను అదుపు చేశాయని వివరించాయి. ఈ ప్రమాదానికి గల కారణం తెలియరాలేదని, విచారణ జరుగుతోందని అధికారులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌లో కొన్ని టేబుళ్లు, కంప్యూట‌ర్లు కాలిపోయాయ‌ని తెలిపారు. అయితే గ‌త‌ 29 నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ స‌మాశాలు ఈనెల 23వ‌తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement