Monday, April 29, 2024

కేసీఆర్ సారు రాజీనామా చేయండి: షర్మిల

తెలంగాణ సీఎం కేసీఆర్ ను మరోసారి టార్గెట్ చేశారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. కరెంట్, ఆర్టీసీ ఛార్జిల పెంపు అంశంపై ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. YSR పాలనలో మున్సిపల్ పన్ను కానీ, కరెంట్ బిల్లులు కానీ, బస్ ఛార్జీలు కానీ అణాపైసా పెంచింది లేదని ఆమె గుర్తు చేశారు. కానీ కేసీఆర్ పరిపాలన చేతకాక విద్యుత్తు సంస్థలను, RTCను నష్టాల్లో కూరుకుపోయేలా చేసి,అవి పూడ్చుకొనేందుకు ఇప్పుడు బస్ ఛార్జీలు,కరెంట్ బిల్లుల భారం పెంచేందుకు రెడీ అయ్యారని విమర్శించారు. మిగులు రాష్ట్రాన్ని కెసిఆర్ చేతిలో పెడితే .. పిచ్చోడి చేతిలో రాయిలా..రేట్లను పెంచి .. సామాన్యుడి పై పన్నుల భారం మోపి, ప్రజల నడ్డి విరిచేందుకు తయారయ్యాడని మండిపడ్డారు. అప్పులు, పన్నులు పెరిగిపోతుంటే.. ఇంకా మీరెందుకు సారు..? రాజీనామా చెయ్యండి అంటూ షర్మిల డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement