Thursday, May 2, 2024

కార్య‌క‌ర్త‌ల‌పై బొత్స చిందులు..పార్టీ నుంచి పొమ్మ‌న్న అమాత్యులు (వీడియోతో)

విజ‌య‌న‌గ‌రం – కూల్ మంత్రిగా పేరు తెచ్చుకున్న మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు కోపం వ‌చ్చింది.. అంతే ఒక్క‌సారిగా బ‌ర‌స్ట్ అయ్యారు.. అదీ స‌మ‌స్య‌లు చెప్పుకునేందుకు వ‌చ్చిన కార్య‌క‌ర్త‌ల‌పైనా. విజయనగరంలో బొత్స పర్యటించి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని కార్యకర్తలతో కలిసి మాట్లాడారు. ఆ సమయంలో ఎస్‌కోట టౌన్ అధ్యక్షుడు రెహమాన్ ఆయన్ను కలిశారు. స్థానిక పరిస్థితులు చెప్పే ప్రయత్నం చేశారు. దాంతో మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు… ఏందయ్యా మీ బాధ.. మీకేనా బాధలు మాకు లేవా? అంటూ కన్నెర్ర జేశారు. .. కార్యకర్తలంటే ఇలానే ఉంటారా..? బాధలు అదరికీ ఉంటాయి, సమయం సందర్భం ఉండక్కర్లేదా.. యూజ్‌లెస్‌ ఫెలో అంటూ.. పార్టీలో ఉంటే ఉండండి, పోతే పోండి అంటూ తీవ్ర స్వరంతో అన్నారు. దాంతో తమ బాధలు చెప్పుకోవడానికి వచ్చిన పార్టీ కార్యకర్తల ముఖం మాడిపోయింది. బొత్స కామెంట్స్ తో ఆవాక్కయ్యారు కార్యకర్తలు. మంత్రి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. సమస్యలు చెప్పుకోవడానికి వస్తే ఇలాగేనా మాట్లాడేదంటూ బొత్స పై ఒంటి కాలిపై లేగుస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement