Wednesday, May 8, 2024

రాజకీయాల్లోకి వస్తా.. లోక్‌సభకు పోటీ చేస్తా ! బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌

బాలీవుట్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి పోటీ చేయాలని ఆశ పడుతున్నట్లు తన మనసులో మాట బయటపెట్టింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమని చెప్పారు. ప్రజలు కోరుకుంటే మండి నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ప్రజలు కోరుకుంటే, బీజేపీ తనకు టికెట్‌ ఇస్తే ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలిపారు. ఓ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన సదస్సులో కంగనా రనౌత్‌ మాట్లాడుతూ… ”హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తే రాజకీయాల్లో చేరతానని, ఇది తన అదృష్టంగా భావిస్తాను” అని తన మనసులోని మాటను బయటపెట్టారు.

2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తనకు టికెట్‌ ఇస్తే రాజకీయాల్లో చేరడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోడీని ”మహాపురుష్‌” అని కొనియాడారు. ప్రధాని మోడీకి రాహుల్‌గాంధీ పోటీదారుడు కావడం విచారకరమని, మోడీకి ప్రత్యర్థులు లేరని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement