Wednesday, May 8, 2024

పెళ్లి పీటలెక్కనున్న బాలీవుడ్ నటులు.. చండీగఢ్ ది ఒబెరాయ్ సుఖ్విలాస్ స్పా అండ్ రిసార్ట్స్ లో వివాహం

పెళ్లి పీటలెక్కనున్నారట బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీలు . వచ్చే నెలలో వీరిద్దరి పెళ్లి అంగరంగా వైభవంగా ఇరువురి కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరగనుందట. అయితే ఈ విషయాలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. వీరి పెళ్లికి సినీ ప్రముఖులు మాత్రమే హజరు కానున్నారని.. ఇక ముంభైలో జరిగే రిసెప్షన్ కు డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.స్టార్ హీరో షాహిద్ కపూర్ కియారాతో కలిసి కాఫీ విత్ కరణ్ షోకి విచ్చేసినప్పుడు కియారా వివాహం డిసెంబర్ లో జరగనున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. వీరి వివాహం చండీగఢ్ లోని ది ఒబెరాయ్ సుఖ్విలాస్ స్పా అండ్ రిసార్ట్స్ లో జరగనుందని టాక్ నడుస్తోంది. ముందుగా వీరిద్దరు తమ వివాహాన్ని గోవాలో సిద్ధార్థ్ కుటుంబసభ్యుల సమక్షంలో పంజాబీ సంప్రదాయంలో నిర్వహించాలని భావించారని.. అనివార్య కారణాలతో చంఢీగడ్ కు మార్చినట్లుగా సమాచారం. ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో పాల్గోన్న సిద్ధార్థ్.. కియారాతో ప్రేమ, పెళ్లి గురించి పరోక్షంగా ప్రస్తావించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement