అతివేగంగా వచ్చిన కారు ఆర్టీసీ బస్ను ఢీకొనడంతో బస్సు చక్రాలు ఊడిపోయిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి నష్టం జరక్కపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. తృటిలో పెను ప్రమాదం తప్పినట్లైంది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఆర్మూర్ డిపోనకు చెందిన ఆర్టీసీ బస్ వేములవాడ నుంచి ఆర్మూర్కు వెళ్తుంది. కరీంనగర్కు చెందిన ఓ కుటుంబం కారులో కథలాపూర్ నుంచి వేములవాడకు అతివేగంగా వెళ్తూ బస్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు చక్రాలు ఊడిపోవడంతో కొంతదూరం ముందుకు వెళ్లి నిలిచింది. అయితే బస్సు నిలిచిన సమీపంలోనే పెద్ద బావి ఉండడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. బస్సులో, కారులో ఉన్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. చిన్నచిన్న గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement