Sunday, May 5, 2024

ఎంపీ జీవీఎల్ కి ఊహించ‌ని సంఘ‌ట‌న‌.. భ‌క్తితో మొక్కుదామంటే కాలెత్తి త‌న్నిన ఆవు

ఓ ఆవుకు న‌మ‌స్క‌రించేందుకు బిజెపి ఎంపీ జీవీఎల్ న‌ర‌సింహారావుకి ఊహించ‌ని సంఘ‌ట‌న ఎదుర‌యింది. ఆవుకు నమస్కరించేందుకు వెళ్లగా అది ఆయనను వెనుక కాలితో తన్నింది. గుంటూరులో మిర్చి ఎగుమతిదారుల అసోసియేషన్ కార్యాలయం నేడు ప్రారంభమైంది. ఈ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు జీవీఎల్ వచ్చారు. కార్యాలయం ప్రారంభోత్సవం కోసం అసోసియేషన్ వారు ఒక ఆవును తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆవుకు నమస్కరించేందుకు వెళ్లగా అది ఆయనను తన్నింది. అయితే పెద్దగా దెబ్బ ఏమీ తగల్లేదు. మరోసారి మొక్కేందుకు ప్రయత్నించగా అది మరోసారి కాలు లేపింది. దీంతో, అక్కడున్న వారు ఆయనను పక్కకు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement