Sunday, May 19, 2024

అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇండియాలో

ప్రపంచంలోనే అతి పెద్దదైన అణు విద్యుత్ ప్లాంటు మహారాష్ట్రలోని జైతాపూర్ ప్రాంతంలో నిర్మితం కానుంది. ఫ్రాన్స్ కు చెందిన ఇంధన సంస్థ ఈడీఎఫ్ ప్రకటించింది. దీనికి అవసరమైన ఆరు మూడవ తరం ఈపీఆర్ రియాక్టర్లను ఫ్రాన్స్ అందించనుంది. సమీప భవిష్యత్తులోనే ఇండియాకు, తమ సంస్థకు మధ్య కాంట్రాక్టు తుది రూపును సంతరించుకుంటుందని ఈడీఎఫ్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇందుకోసం తమ అధికారులు భారత్ తో ప్రత్యేకంగా చర్చిస్తున్నారని తెలిపింది. ప్లాంటు మొత్తాన్నీ తామే నిర్మించడం లేదని, యూఎస్ కు చెందిన తమ భాగస్వామ్య సంస్థ జీఈ స్టెమ్ పవర్ తో కలిసి న్యూక్లియర్ రియాక్టర్లను సరఫరా చేస్తామని తెలిపింది.

ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంటు పూర్తయితే 10 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ విద్యుత్ తో 7 కోట్ల ఇళ్లకు అవసరమైన విద్యుత్ ను సరఫరా చేయవచ్చు. భారత ప్రభుత్వ అధీనంలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ (ఎన్సీపీఐఎల్) ఈ ప్లాంటును చేపట్టింది. ఈ ప్రాజెక్టుపై తమ ఆసక్తిని ఇప్పటికే వెల్లడించిన ఈడీఎఫ్, డీల్ విలువ, ఒక్కో రియాక్టర్ కు వసూలు చేసే మొత్తం తదితరాలను మాత్రం వెల్లడించలేదు. అయితే, ఈ రంగంలోని నిపుణుల అంచనా ప్రకారం, దీని విలువ వేల కోట్లల్లోనే ఉండనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement