Tuesday, May 14, 2024

హుస్సేన్‌సాగర్‌లో తప్పిన పెను ప్రమాదం.. గాలుల తీవ్రతతో మధ్యలోనే ఆగిన టూరిస్టు బోటు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : నిత్యం పర్యాటకులతో కలకలలాడే హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో పెనుప్రమాదం తప్పింది. సాంకేతిక కారణాలతో 60 మందితో ప్రయాణిస్తున్న ఓ టూరిస్టు బోటు సాగర్‌ మధ్యలో అకస్మాత్తుగా ఆగిపోయింది. బుధవారం జరిగిన ఈ ఘటనపై బోట్‌లో ఉన్న ఓ టూరిస్ట్‌ ట్వీట్‌ చేయడంతో గురువారం వెలుగులోకి వచ్చింది. 60 మంది సందర్శకులతో ఉన్న బోటు హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధుని విగ్రహం వద్దకు వెళ్లింది. తిరిగి వెనక్కి వస్తున్న సమయంలో గాలుల తీవ్రతతో ఇంజిన్‌ ఆగిపోయింది.

దీంతో టూరిజం సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. స్టీమర్‌ బోట్ల సాయంతో పెద్ద బోటును ఒడ్డుకు చేర్చారని పర్యాటకుడు ట్వీట్‌లో పేర్కొన్నారు. దీనిపై టూరిజం ఎండీ మనోహర్‌ స్పందించారు. గాలుల తీవ్రత ఎక్కువైనపుడు ఒడ్డుకు వచ్చే సమయంలో బోటు ఇంజన్‌ స్లో చేస్తామని, అవసరమైతే స్టీమర్‌ బోట్లతో ఒడ్డుకు చేరుస్తామని చెప్పారు. గాలుల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రస్తుతం హుస్సేన్‌సాగర్‌లో టూరిస్టు బోట్లను తిప్పడం లేదని వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement