Monday, May 6, 2024

పోరాటం కొవిడ్ పైనే.. కాంగ్రెస్‌ పై కాదు: రాహుల్

దేశంలో క‌రోనా విజృంభన నానాటికీ పెరిగిపోతోంది. దేశంలో ప‌రిస్థితులు రోజురోజుకీ దిగ‌జారిపోతోన్నాయి. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవ‌డంలో కేంద్ర ప్ర‌భుత్వం పూర్తిగా విఫ‌ల‌మ‌వుతోంద‌ని కాంగ్రెస్ నేత రాహుల్ గత కొన్ని రోజులుగా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. తాజాగా ప్ర‌ధాని మోదీపై మరోసారి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. పోరాటం కోవిడ్ పైనే గానీ కాంగ్రెస్ పై కాదని రాహుల్ పేర్కొన్నారు. కరోనాపై పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని, దీనిపై రాజ‌కీయప‌ర ఒప్పందం అవ‌స‌ర‌మ‌ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కేంద్ర ప్ర‌భుత్వానికి సూచించిన ఓ వార్త‌ను రాహుల్‌ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.  

‘ప్ర‌ధాని మోదీ ప్ర‌భుత్వం ఒక విష‌యాన్ని గ్ర‌హించాలి. ప్ర‌స్తుతం పోరాటం కొవిడ్ పై మాత్రమే. అంతేగానీ, కాంగ్రెస్, ఇత‌ర రాజ‌కీయ పార్టీల‌తో కాదు’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement