Sunday, May 12, 2024

Followup : ఉప్పుగూడలో దారుణం.. 17 ఏళ్ల బాలికపై యువకుల అత్యాచారం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌ పాతబస్తీలోని ఉప్పుగూడలో దారుణం చోటు చేసుకుంది. 17 ఏళ్ల బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. అలీ తన స్నేహితుడు అర్బాస్‌తో కలిసి బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఇందుకు సంబంధించి బాధిత బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు అలీ, అర్బాస్‌లను అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసుకు సంబంధించి పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే బాధిత బాలికకు నిందితుడు అలీ ముందే తెలుసని.. ఆమెతో ఉన్న స్నేహాన్ని అదునుగా తీసుకుని స్నేహితుడితో కలిసి అత్యాచారానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement