Thursday, May 2, 2024

ఆత్మ‌కూరు ప్ర‌జ‌ల‌కు రుణ‌ప‌డి ఉంటా : మేక‌పాటి విక్ర‌మ్ రెడ్డి

నెల్లూరు : ఆంధ్రప్రదేశ్‌లోని ఆత్మకూరు ఉపఎన్నికల్లో అధికార వైసీపీ భారీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి తిరుగులేని ఆధిక్యంతో గెలుపొందాడు. ఆత్మకూరులో ముగిసిన ఉప ఎన్నికల కౌంటింగ్ ముగిసిన అనంత‌రం మేక‌పాటి విక్ర‌మ్ రెడ్డి ఆత్మ‌కూరు ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్యేక‌ ధ‌న్య‌వాదాలు తెలిపారు. నాపై న‌మ్మ‌కంతో ఓటు వేసి.. 82,888 ఓట్ల మెజార్టీతో ఘ‌న విజ‌యం సాధించినందుకు సంతోషంగా ఉంది. ప్ర‌జ‌ల‌ను నాపై పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌కుండా పాల‌న కొన‌సాగిస్తాన్నారు. ప్ర‌జ‌ల‌కు ఎలాంటి క‌ష్టాలు ఉన్నా నా దృష్టికి తీసుకురావాల‌న్నారు. ఇంత‌టి గొప్ప విజ‌యాన్ని అందించిన ఆత్మ‌కూరు ప్ర‌జ‌ల‌కు రుణ‌ప‌డి ఉంటాన‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement